రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు, వాటర్ హీటర్ షాక్తో యువకుడు మృతి
Published : Sep 10, 2024, 11:59 AM IST
Two Youngers Died After Hitting Parked Lorry with Bike : ఇద్దరు స్నేహితులను రోడ్డు ప్రమాదం మింగేసింది. వారిలో ఒకరు ఏకైక సంతానం కాగా, మరొకరికి ఏడాది క్రితమే వివాహం అయింది. ఈ ఘటన షాద్నగర్ ఎలికట్ట శివారులో ఆదివారం జరిగింది. వీరిద్దరూ ఒకే వృత్తిలో స్థిరపడ్డారు. వీరిలో కొందుర్గు మండలం చిల్కమర్రికి చెందిన కృష్ణయ్య, లక్ష్మమ్మ దంపుతులకు ఏకైక సంతానం కరుణాకర్, అదే మండలం పులుసుమామిడికి చెందిన మరో యువకుడు రెడ్డి శేఖర్ స్నేహితులు. వీరిద్దరూ కారు డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తారు. షాద్నగర్ నుంచి ఇంటికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా, నిలిచి ఉన్న లారీని గమనించకుండా వేగంగా వచ్చి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఘటనలో హైదరాబాద్లోని మియాపూర్లో వాటర్ హీటర్ను బకెట్ నుంచి బయటకు తీసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఏపీకి చెందిన ఓ యువకుడు మరణించాడు.