తెలంగాణ కొత్త గవర్నర్గా బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్న జిష్ణుదేవ్ వర్మ
Published : Jul 30, 2024, 3:05 PM IST
Jishnu Dev Varma to Take Oath as Telangana Governor :తెలంగాణ కొత్త గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్భవన్లో రేపు సాయంత్రం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే గవర్నర్తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం జిష్ణుదేవ్ వర్మ హైదరాబాద్కు రానున్నారు. త్రిపురకు చెందిన ఈయన రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. జిష్ణుదేవ్ వర్మ 2018-2023 మధ్య త్రిపుర ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణతో పాటు జార్ఖండ్ గవర్నర్గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు.