Theft in a Train Going from Shirdi to Kakinada : షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో గురువారం జరిగిన చోరీ ఘటన కలకలం రేపింది. అర్ధరాత్రి మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. మహారాష్ట్ర లాతూరు వద్ద చోరీ జరిగినట్లు గుర్తించిన ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకొని, రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ - సుమారు రూ.30 లక్షల విలువైన బంగారం అపహరణ
Published : Jul 26, 2024, 11:30 AM IST
|Updated : Jul 26, 2024, 12:15 PM IST
Theft in a Train Going from Shirdi to Kakinada (ETV Bharat)
మూడు బోగీల్లో ఏపీకి చెందిన ప్రయాణికుల నుంచి సుమారు రూ. 30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, మొబైల్స్, డైమండ్ రింగులు అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు. రాత్రి రెండు గంటల సమయంలో మూడు బోగీలలో చోరీ జరిగినట్లు భాదితులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Jul 26, 2024, 12:15 PM IST