national

భూముల రిజిస్ట్రేషన్​ రేట్లు పెంపుతున్నారని పుకార్లు​​ - కార్యాలయాలకు జనం బారులు

By ETV Bharat Telangana Team

Published : Jul 31, 2024, 3:52 PM IST

Updated : Jul 31, 2024, 4:01 PM IST

Heavy public At Registration Center in Karimanagar
Heavy public At Registration Center in Karimanagar (ETV Bharat)

Heavy public At Registration Center in Karimanagar :ఆగస్టు నుంచి వ్యవసాయ, వాణిజ్య భూముల రిజిస్ట్రేషన్​ ఛార్జీలు పెరగనున్నాయంటూ వస్తున్న పుకార్లు నమ్మి పలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు జనాలు పోటెత్తారు. కరీంనగర్​ జిల్లాలో భూముల క్రయ, విక్రయదారుల వరుస కట్టారు. ప్రస్తుతం అమలవుతున్న ఛార్జీల్లోనే ఆస్తి బదలాయింపు చేసుకుందామనే యోచనలో ఉన్నారు. దీంతో జులై నెల చివరి రోజుల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా పెరిగింది.

మరోవైపు రిజిస్ట్రేషన్​ సర్వర్​ పనిచేయకపోవడంతో డాక్యుమెంట్లు పేరుకు పోతున్నాయి. సాధారణంగా రోజుకు 30 రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తారు, కానీ ప్రస్తుతం రోజుకు వందకు పైగా రిజిస్ట్రేషన్లు స్లాట్లు బుక్​ అవుతున్నాయి. రిజిస్ట్రేషన్​కు వచ్చే సరికి 60 పూర్తవుతుండగా మిగతావారు వెనుదిరుగుతున్నారు. అయితే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారన్న వార్త వాస్తవం కాదని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.

Last Updated : Jul 31, 2024, 4:01 PM IST

ABOUT THE AUTHOR

...view details