Published : Jul 13, 2024, 3:11 PM IST
సంగారెడ్డిలో దుండగుల బీభత్సం - పెట్రోల్ పోసి బైక్ దగ్ధం
The Assailants Poured Petrol on the Bike and Set it on Fire :సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం బడంగ్పేట్లో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనానికి నిప్పంటించారు. స్థానికుల వివరాల మేరకు అదే గ్రామానికి చెందిన గడ్డమీది బాలరాజ్కు బైక్ ఉంది. అయితే శుక్రవారం అర్ధరాత్రి దుండగులు బైక్పై పెట్రోల్ పోసి నిప్పంటించారు దీంతో బైక్ పూర్తిగా దగ్ధమైంది. కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ముతో కొన్న బైక్ను దుండగులు కాల్చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.