Published : May 28, 2024, 5:03 PM IST
రానున్న మూడు రోజులు పొడి వాతావరణం - కేరళలోకి ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు
Telangana Weather Report Today: తెలంగాణలో రానున్న మూడు రోజులు పొడి వాతావరణం ఉండనుందని ఉష్ణోగ్రతలు క్రమేపీ రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మంగళ, బుధ, గురువారాల్లో వాతావరణం ఉష్ణోగ్రత పెరిగి 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో కింది స్థాయి గాలులు పశ్చిమ, వాయువ్య దిశల నుంచి వీస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు రాగల 3 నుంచి 4 రోజుల్లో కేరళలో ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా మారాయని ప్రకటించింది.