national

By ETV Bharat Telangana Team

Published : May 28, 2024, 5:03 PM IST

ETV Bharat / snippets

రానున్న మూడు రోజులు పొడి వాతావరణం - కేరళలోకి ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు

IMD Report in Telangana
Southwest Monsoon Update (ETV Bharat)

Telangana Weather Report Today: తెలంగాణలో రానున్న మూడు రోజులు పొడి వాతావరణం ఉండనుందని ఉష్ణోగ్రతలు క్రమేపీ రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ శాఖ తెలిపింది. మంగళ, బుధ, గురువారాల్లో వాతావరణం ఉష్ణోగ్రత పెరిగి 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో కింది స్థాయి గాలులు పశ్చిమ, వాయువ్య దిశల నుంచి వీస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు రాగల 3 నుంచి 4 రోజుల్లో కేరళలో ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా మారాయని ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details