నాలుగున్నరేళ్ల బాలికపై హత్యాచారం - దోషికి ఉరిశిక్ష ఖరారు
Published : Jul 31, 2024, 7:01 PM IST
High Court Sentenced Hanging to Child Rapist : నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషికి ఉరిశిక్ష విధించిన రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పును తెలంగాణ హైకోర్టు సమర్ధించింది. నార్సింగి ఠాణా పరిధిలో బాలికపై 2018లో సెంట్రింగ్ కార్మికుడు దినేశ్కుమార్ కిరాతకానికి ఒడిగట్టి హత్య చేసిన ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించి విచారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు దోషి దినేశ్కుమార్కు 2021లో ఉరిశిక్ష విధించింది. ఆ తీర్పును అతడు హైకోర్టులో సవాల్ చేశాడు. ఈ మేరకు కింది కోర్టు ఇచ్చిన ఉరిశిక్ష తీర్పును తెలంగాణ హైకోర్టు సమర్ధించింది.