national

స్కిల్‌ యూనివర్సిటీ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ ఛైర్మన్‌గా ఆనంద్‌ మహీంద్రా నియామకం

By ETV Bharat Telangana Team

Published : Aug 15, 2024, 6:19 PM IST

TELANGANA SKILL UNIVERSITY
Skill University Chairmen as Anand Mahindra (ETV Bharat)

Skill University Chairmen as Anand Mahindra :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ ఛైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆనంద్‌ మహీంద్రా ఏడాదిపాటు ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

రాష్ట్ర యువతకు నైపుణ్యాలు నేర్పించేలా రంగారెడ్డి జిల్లాలో ముచ్చర్లలోని బేగరికంచెలో స్కిల్‌ యూనివర్సిటీ నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. స్కిల్‌ యూనివర్సిటీ ద్వారా 17 రకాల కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ప్రైవేటు సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఏటా లక్షమందికి శిక్షణ ఇచ్చేలా రాబోయే కాలంలో ఈ వర్సిటీని విస్తరించనున్నారు. బేగరికంచెలో సొంత భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా భవనంలో వర్సిటీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details