అయోధ్య సరయూ నదిలో జనగామ యువతి గల్లంతు
Published : Jul 30, 2024, 8:03 PM IST
|Updated : Jul 30, 2024, 9:18 PM IST
Warangal Girl Missed in Sarayu River :అయోధ్య సరయూ నదిలో జనగామకు చెందిన యువతి గల్లంతయ్యింది. ఈ నెల 28న జనగామ పట్టణానికి చెందిన తాళ్లపల్లి నాగరాజు కుటుంబం అయోధ్య రామ మందిర దర్శనానికి వెళ్లారు. మరుసటి రోజు సరయూ నదిలో స్నానాలు చేస్తుండగా ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో నాగరాజు కుటుంబానికి చెందిన ఐదుగురు గల్లంతయ్యారు. అందులో నలుగురిని సురక్షితంగా స్థానికులు కాపాడగా, తేజశ్రీ అనే యువతి ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం నుంచి రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపడుతున్నా ఎలాంటి ఫలితంగా లేదు. తేజశ్రీ జనగామ పట్టణంలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది.