విద్యార్థినిని వేధించిన కీచక టీచర్ - దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు
Published : Jul 30, 2024, 5:04 PM IST
Teacher Harassing on Girl Student In Khammam: విద్యార్థినిని వేధించిన ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన ఖమ్మం జిల్లా ఇల్లందులో జరిగింది. పట్టణంలోని పాఠశాలలో రాందాస్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో 9 తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని రాందాస్ కొన్ని రోజులుగా వేధిస్తున్నాడని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడు రాందాస్కు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.