LOVERS SUICIDE IN KAMAREDDY:పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే మనస్తాపంతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న వారిని సాయికుమార్(24), వీణ(22) లుగా గుర్తించారు. దోమకొండ మండలం అంబర్పేట్ గ్రామానికి చెందిన వీణ, కోనపూర్ గ్రామానికి చెందిన సాయి కుమార్లు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే కారణంతో కోనాపూర్లోని పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు.
పెళ్లికి ఇంట్లో ఒప్పుకోరని మనస్తాపంతో కామారెడ్డిలో ఇద్దరు ప్రేమికుల ఆత్మహత్య
Published : 5 hours ago
LOVERS SUICIDE IN KAMAREDDY (ETV Barat)
విషయం తెలిసిన వీణ (23) తాను కూడా ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రేమ జంట ఆత్మహత్యతో ఇరు కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు దోమకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరూ వారి తల్లిదండ్రులకు అసలు ప్రేమ విషయం చెప్పలేదని పోలీసులు తెలిపారు.