national

పెళ్లికి ఇంట్లో ఒప్పుకోరని మనస్తాపంతో కామారెడ్డిలో ఇద్దరు ప్రేమికుల ఆత్మహత్య

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

DHOMAKONDA SUICIDE ISSUE
LOVERS SUICIDE IN KAMAREDDY (ETV Barat)

LOVERS SUICIDE IN KAMAREDDY:పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే మనస్తాపంతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న వారిని సాయికుమార్(24), వీణ(22) లుగా గుర్తించారు. దోమకొండ మండలం అంబర్​పేట్ గ్రామానికి చెందిన వీణ, కోనపూర్ గ్రామానికి చెందిన సాయి కుమార్​లు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే కారణంతో కోనాపూర్​లోని పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు.

విషయం తెలిసిన వీణ (23) తాను కూడా ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రేమ జంట ఆత్మహత్యతో ఇరు కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు దోమకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరూ వారి తల్లిదండ్రులకు అసలు ప్రేమ విషయం చెప్పలేదని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details