national

కాళేశ్వరంపై విచారణపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువు పొడిగింపు

By ETV Bharat Telangana Team

Published : Jun 29, 2024, 3:18 PM IST

Justice PC Ghosh Commission
State Govt extends Justice PC Ghosh Commission (ETV Bharat)

State Govt extends Justice PC Ghosh Commission : కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. మరో రెండు నెలల పాటు గడువు పొడిగించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల అంశాలపై విచారణ చేస్తున్న కమిషన్ గడువు నెలాఖరు వరకు ఉంది.

విచారణ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో కమిషన్ గడువును మరో రెండు నెలల పాటు పొడిగించింది. ఆగస్టు 31వ తేదీ వరకు కమిషన్ గడువు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ లోపు కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details