Published : May 31, 2024, 10:42 PM IST
కొండగట్టు క్షేత్రంలో వెల్లివిరిసిన మతసామరస్యం - దీక్షాపరులకు నీళ్లు, మజ్జిగ అందించిన ముస్లిం సోదరులు
Muslim Brothers Serve Water Packets To Devotees : జగిత్యాల జిల్లా కొండగట్టు పుణ్యక్షేత్రంలో మత సామరస్యం వెల్లివిరిసింది. భానుడి ప్రతాపాన్ని లెక్కచేయకుండా పాదయాత్ర చేస్తున్న హనుమాన్ దీక్షా పరులకు ముస్లిం సోదరులు మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లతో సేవలందించారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సిరాజుద్దీన్ మన్సూర్ తన సోదరులతో కలిసి కొండగట్టు పుణ్యక్షేత్రంలో హనుమాన్ దీక్షాపరులకు మజ్జిగ, మంచినీళ్లు ప్యాకెట్లను అందించారు. కాలినడకన మండుటెండలో కొండగట్టుకు చేరుకుంటున్న భక్తులకు ముస్లిం సోదరులు చేపట్టిన సేవ ఉపశమనం కలిగించింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన వారిని స్థానికులు అభినందించారు.