national

దిల్లీ మద్యం కేసు - ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

By ETV Bharat Telangana Team

Published : Jul 31, 2024, 11:57 AM IST

MLC Kavitha Judicial Custody Extended
MLC Kavitha Judicial Custody Extended (ETV Bharat)

MLC Kavitha Judicial Custody Extended : దిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్‌ కస్టడీని న్యాయస్థానం మరోసారి పొడిగించింది. ఎమ్మెల్సీ కవితతో పాటుగా దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, ఆప్ నేత సిసోదియా జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగిస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 9 వరకు కస్టడీని పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. గతంలో కోర్టు విధించిన గడువు ముగిసింది. దీంతో సీబీఐ అధికారులు ముగ్గురిని కోర్టు ముందు వర్చువల్‌గా హాజరుపరిచారు. కస్టడీని పొడిగింపుపై సీబీఐ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ABOUT THE AUTHOR

...view details