దిల్లీ మద్యం కేసు - ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
Published : Jul 31, 2024, 11:57 AM IST
MLC Kavitha Judicial Custody Extended : దిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్ కస్టడీని న్యాయస్థానం మరోసారి పొడిగించింది. ఎమ్మెల్సీ కవితతో పాటుగా దిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆప్ నేత సిసోదియా జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 9 వరకు కస్టడీని పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. గతంలో కోర్టు విధించిన గడువు ముగిసింది. దీంతో సీబీఐ అధికారులు ముగ్గురిని కోర్టు ముందు వర్చువల్గా హాజరుపరిచారు. కస్టడీని పొడిగింపుపై సీబీఐ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.