ప్రభుత్వ దవాఖానాలను నాశనం చేసే కుట్రలను కేటీఆర్ మానుకోవాలి : మంత్రి దామోదర రాజనర్సింహ
Published : Sep 18, 2024, 9:39 PM IST
Minister Damodar Raja Narasimha Fires on KTR : ప్రభుత్వ దవాఖానాలను నాశనం చేసే కుట్రలను కేటీఆర్ మానుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. గాంధీ ఆసుపత్రిపై బురద జల్లి అక్కడ వైద్య చికిత్సల కోసం వచ్చే నిరుపేదల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం బాధాకరమని మండిపడ్డారు. గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ దవాఖానాలను పదేళ్లపాటు నాశనం చేసిన బీఆర్ఎస్, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అదే తరహాలో కుట్రలు చేయడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిన ప్రభుత్వ వైద్య వ్యవస్థను గాడిన పెడుతున్నామని, అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.