KTR visit Choppadandi MLA House :చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కుటుంబాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పరామర్శించారు. అల్వాల్లోని పంచశీల కాలనీలో మేడిపల్లి సత్యం కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రూపాదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మేడిపల్లి సత్యం కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్
Published : Jun 26, 2024, 10:08 PM IST
KTR visit Choppadandi MLA House (ETV Bharat)
అనారోగ్య కారణంతో రూపాదేవి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. భగవంతుడు వారి కుటుంబానికి భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని అందించాలని కోరారు. కేటీఆర్తో పాటు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే సుమన్లు ఉన్నారు.