national

By ETV Bharat Telangana Team

Published : Jul 29, 2024, 3:31 PM IST

ETV Bharat / snippets

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం - భార్యను చంపి, ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న భర్త

Husband Killed Wife
Husband Killed His Wife In Rajanna Sircilla (ETV Bharat)

Husband Killed His Wife In Rajanna Sircilla : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యను చంపి, తాను ఉరేసుకొని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. శాంతి నగర్‌కు చెందిన దూస రాజేశం గత కొంతకాలంగా కిడ్నీల వ్యాధితో బాధపడుతున్నాడు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్న రాజేశం తనకు మెరుగైన వైద్యం చేయించాలని కుటుంబ సభ్యులతో తరచూ గొడవ పడేవాడు.

ఈ క్రమంలోనే భార్యతో విగ్వాదానికి దిగిన రాజేశం క్షణికావేశంలో భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత తానూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేశం, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్దకుమారుడు, కుమారైకు వివాహం కాగా చిన్న కుమారుడు బీటెక్‌ చేస్తున్నట్లు వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details