Fake Currency Notes Printing Gang Arrest :వికారాబాద్ జిల్లాలో నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. తాండూరులో నకిలీ నోట్లను తయారు చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.7.95 లక్షల నకిలీ నోట్లతో పాటు వాటి తయారీకి ఉపయోగించిన కంప్యూటర్, ప్రింటర్, 5 చరవాణీలను స్వాధీనం చేసుకున్నారు.
Published : Jul 20, 2024, 6:36 PM IST
నకిలీ నోట్లు ముద్రించి తెలుగు రాష్ట్రాల్లో చలామణి - నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్
Fake Currency Notes Printing Gang Arrest (ETV Bharat)
ఈ నెల 19న తాండూరు రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న చంద్రయ్య అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. దీంతో ఈ నకిలీ నోట్ల దందా గుట్టు బయటపడింది. నిందితులు నోట్లను ముద్రించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పంపిణీ చేశారని పోలీసులు గుర్తించారు.