Published : Sep 28, 2024, 1:28 PM IST
సీఎం రేవంత్కు విద్యావేత్తల లేఖ - ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్
Educationists letter to CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ విద్యా వేత్తలు బహిరంగ లేఖ రాశారు. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన భూమిని జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ విశ్వ విద్యాలయానికి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విద్యా వేత్తలు కోదండరాం, హరగోపాల్, ఘంటా చక్రపాణి, దొంతి నరసింహ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడున్న విశ్వవిద్యాలయాల్లో నామమాత్రం ఫీజుతో విద్యనందిస్తున్న ఒకే ఒక విశ్వవిద్యాలయం అంబేడ్కర్ యూనివర్సిటీ అన్నారు. ఈ యూనివర్సిటీని నిలబెట్టుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉందని విద్యా వేత్తలు సూచించారు.