TG Assembly Session : తెలంగాణ శాసనసభ సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఈవేళ కూడా ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. ఇవాళ మొత్తం 19 పద్దులపై శాసనసభలో చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు ఈ పద్దులను సభలో ప్రవేశపెడతారు.
నేడు తెలంగాణ శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ
Published : Jul 29, 2024, 7:45 AM IST
పద్దుల్లో ప్రధానంగా ఆర్థిక నిర్వహణ, ఆర్థిక ప్రణాళిక, విద్యుత్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, పరిశ్రమల, ఐటీ, ఎక్సైజ్ హోం, కార్మిక ఉపాధి, రవాణా, బీసీ సంక్షేమం, పాఠశాల విద్యా, ఉన్నత విద్యా, సాంకేతిక విద్యా, మెడికల్ అండ్ హెల్త్ తదితర 19 పద్దులపై చర్చించి ఆమోదం తెలపనుంది. ఈ పద్దులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు తదితరులు సభలో ప్రవేశపెట్టనున్నారు.