national

'గోదావరి లోతట్టు ప్రాంతాలకు ముందస్తు చర్యలు చేపట్టాలి'

By ETV Bharat Telangana Team

Published : Jun 19, 2024, 1:56 PM IST

Kothagudem Collector Visit Badrachalam
Collector Patel Visit Bhadrachalam (ETV Bharat)

Collector on Godavari Advance measures in Badrachalam: వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు ముందస్తుగా చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సూచించారు. ఈ సందర్భంగా భద్రాచలంలోని గోదావరి కరకట్ట లోతట్టు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ముందుగా విస్తా కాంప్లెక్స్ వద్ద భద్రాచలం పట్టణం నుంచి మురుగునీరు గోదావరిలో కలిసే లాకులను గమనించారు.

అనంతరం లోతట్టు ప్రాంతాలైన కొత్త కాలనీ సుభాశ్​నగర్ కాలనీలోని కరకట్ట ఏ విధంగా ఉంది వరద వస్తే ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే విషయాలపై అధికారులతో చర్చించారు.

ABOUT THE AUTHOR

...view details