'నెట్ జీరో' సిటీని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
Published : Jul 28, 2024, 10:36 PM IST
|Updated : Jul 28, 2024, 10:41 PM IST
CM Revanth Visit NetZero City At Mirkhanpet :హైదరాబాద్ నగర శివారులో అద్భుత నగర నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. కాలుష్య రహితం, వంద శాతం కర్బన ఉద్గారాల రహితంగా 'నెట్ జీరో' సిటీ నిర్మాణం చేయనుంది. ఈ నేపథ్యంలోనే కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట వద్ద ఏర్పాటు చేయనున్న నెట్ జీరో సిటీని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. నెట్ జీరో సిటీ ప్లాన్ మ్యాప్ను ఆయన పరిశీలించారు. అధికారులు నెట్ జీరో సిటీ వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు.