Singareni CMD Balaram on Singareni Properties : సింగరేణి ఆస్తులు, క్వార్టర్ల పరిరక్షణకు హైడ్రా తరహా చర్యలు తీసుకుంటామని సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి ఆస్తులు, క్వార్టర్లను పరిరక్షించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. దీన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్క ఉద్యోగి కృషి చేయాలని సూచించారు.
సింగరేణి సంస్థ చరిత్రలోనే తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత ఉద్యోగ నియామక పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని బలరాం చెప్పారు. ఇందులో 272 ఎక్స్టర్నల్ పోస్టుల ప్రొవిజినల్ మెరిట్ లిస్టును కూడా విడుదల చేసినట్లు తెలిపారు. త్వరలోనే మిగిలిన 327 పోస్టుల ఫలితాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.