ETV Bharat / state

'దేవాలయాల్లో ఇక నుంచి సింథటిక్​ శాలువాలు వాడొద్దు - చేనేతవే వాడాలి' - Ministers Review on Endowment Dept - MINISTERS REVIEW ON ENDOWMENT DEPT

Endowment Dept Development : దేవాలయాల్లో ఇక నుంచి సింథటిక్​ శాలువాలు వాడవద్దని చేనేతవే వాడాలని దేవాదాయ శాఖ మంత్రి సురేఖకు మంత్రులు వినతిపత్రం అందించారు. తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన దేవాలయాల్లో మౌళిక వసతులు, అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రులు సమీక్ష నిర్వహించారు.

Endowment Dept Development
Endowment Dept Development (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 19, 2024, 7:52 PM IST

Ministers Review on Endowment Dept : తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన దేవాలయాల్లో మౌళిక వసతులు, అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని దేవాదాయ ధర్మాదాయ మంత్రిత్వ శాఖ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం, బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి పనుల పురోగతిపై అటవీ, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లతో కలిసి సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో ప్రతి దేవాలయంలో సింథటిక్ శాలువాలు వాడకుండా చేనేత శాలువాలు, చేనేత బ్యాగులు వాడేలా ఆదేశాలు ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లు వినతిపత్రం ఇచ్చారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో జరిగే దసరా నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్​లను మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంతరావులు విడుదల చేశారు.

ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంతరావు, బాసర దేవాలయ ఈవో విజయ రామారావు, వేములవాడ దేవాలయ ఈవో వినోద్, భద్రాచలం ఈవో రమాదేవి, స్థపతి ఎన్. వల్లి నాయగన్, ఎస్ఈ కె. దుర్గా ప్రసాద్, సహాయ స్థపతి పి. గణేషన్, ప్రధానార్చకులు ఉమేష్, కన్సర్వేష ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి, పలువురు అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.

Ministers Review on Endowment Dept : తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన దేవాలయాల్లో మౌళిక వసతులు, అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని దేవాదాయ ధర్మాదాయ మంత్రిత్వ శాఖ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం, బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి పనుల పురోగతిపై అటవీ, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లతో కలిసి సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో ప్రతి దేవాలయంలో సింథటిక్ శాలువాలు వాడకుండా చేనేత శాలువాలు, చేనేత బ్యాగులు వాడేలా ఆదేశాలు ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లు వినతిపత్రం ఇచ్చారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో జరిగే దసరా నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్​లను మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంతరావులు విడుదల చేశారు.

ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంతరావు, బాసర దేవాలయ ఈవో విజయ రామారావు, వేములవాడ దేవాలయ ఈవో వినోద్, భద్రాచలం ఈవో రమాదేవి, స్థపతి ఎన్. వల్లి నాయగన్, ఎస్ఈ కె. దుర్గా ప్రసాద్, సహాయ స్థపతి పి. గణేషన్, ప్రధానార్చకులు ఉమేష్, కన్సర్వేష ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి, పలువురు అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.

ఎంఎస్​ఎంఈలు అభివృద్ధి చెందడం ద్వారానే రాష్ట్రాల వృద్ధి : సీఎం రేవంత్​ రెడ్డి - MSME New Policy Programme in Hyd

2035 నాటికి రాష్ట్రంలో 40,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తే లక్ష్యం : భట్టి - Deputy CM Bhatti On Green Power

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.