national

నాయకుల కాళ్లకు దండం పెట్టే సంస్కృతికి ఫుల్‌స్టాప్‌ పెట్టండి : చంద్రబాబు

By ETV Bharat Telangana Team

Published : Jul 13, 2024, 1:31 PM IST

CM Chandrababu
CM Chandrababu (ETV Bharat)

CM Chandrababu:రాష్ట్రంలోనాయకుల కాళ్లకు దండం పెట్టే సంస్కృతి పోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇక నుంచి ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే, తానూ వారి కాళ్లకు దండం పెడతానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇవాళ్టి నుంచి నా కాళ్లకు దండం పెట్టే విధానానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని సీఎం వెల్లడించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో మీడియా చిట్‌చాట్‌లో ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు తెలిపారు.

తల్లిదండ్రులు, భగవంతుడు కాళ్లకే ఎవరైనా నమస్కారం పెట్టాలి తప్ప నాయకులకు కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. నాయకుల కాళ్లకు నమస్కరించి ఎవ్వరూ తమ గౌరవాన్ని తగించుకోవద్దని ఆయన సూచించారు. రాష్ట్రంలో నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టకూడదనే విధానాన్ని తన నుంచే ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details