national

ETV Bharat / snippets

నారాయణపేట జిల్లాలో బస్సు, ద్విచక్ర వాహనం ఢీ - ఇద్దరి దుర్మరణం

By ETV Bharat Telangana Team

Published : May 28, 2024, 3:02 PM IST

Road Accident AT Makthal
Road Accident AT Makthal (ETV Bharat)

Road Accident AT Makthal :నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రం దండు సమీపంలో కర్ణాటకకు చెందిన ఓ బస్సు, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడిన మరొకరిని మహబూబ్​నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details