BJP Protest at Indira Park :రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ పోరుకు సిద్ధమైంది. ఇవాళ ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద రైతు హామీల సాధన పేరుతో దీక్ష చేపట్టనుంది. ఉదయం 11 గంటల నుంచి మంగళవారం ఉదయం 11 గంటల వరకు 24 గంటల పాటు దీక్ష నిర్వహించనుంది. ఈ దీక్షలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కీలక నేతలు పాల్గొననున్నారు.
Published : 5 hours ago
నేడు ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద బీజేపీ 'రైతు హామీల సాధన' దీక్ష
BJP Protest at Indira Park (ETV Bharat)
ఇప్పటికే ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద దీక్ష స్థలితో పాటు ఇతర ఏర్పాట్లను పూర్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇస్తామని చెప్పిన రూ.2 లక్షల రుణమాఫీతో పాటు రైతు భరోసా, రైతు బీమా, వడ్లకు బోనస్ వంటి అంశాలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దీక్షకు పూనుకుంది. ఈ దీక్షకు రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, మద్దతు తెలపాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది.