Airport Construction in Warangal : నిజాం కాలంలో వాయుదూత్ విమానాలు నడిచి భారత్ చైనా యుద్ధ సమయంలో కీలక సేవలు అందించింది. దాదాపు 32 ఏళ్ల కిందట మూతపడిన మామునూరు విమానాశ్రయానికి మళ్లీ రెక్కలు రానున్నాయి. అప్పుడప్పుడు శిక్షణ ఎయిర్క్రాఫ్ట్లు నడుస్తున్న ఈ విమానాశ్రం నుంచి మళ్లీ విమానం ఎగిరే రోజులు త్వరలోనే రానున్నాయి. వరంగల్ అభివృద్ధికి ఇది కీలకం కానుంది. ఈ ఎయిర్పోర్టు పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. కొన్నేళ్లుగా ముందుకా, వెనక్కా అన్నట్లు సాగిన నిర్మాణాన్ని నయా సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అత్యంత కీలకమైన భూసేకరణ కోసం నిధులు మంజురు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో విమానయానం చేయాలన్న ఓరుగల్లు వాసుల కల సాకారం కాబోతుంది.
విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలి అంటే 949.14 ఎకరాల భూమి అవసరం. ప్రస్తుతం 696.14 ఎకరాలు ఉంది. దానికి అదనంగా కావాల్సిన మరో 253 ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు. భూ నిర్వాసితులకు పరిహారం, ఇతరత్రా వాటి కోసం తాజాగా ప్రభుత్వం రూ.205 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. దీంతో విమానాశ్రయం డీపీఆర్ను సిద్ధం చేయాలని ఆర్అండ్బీ శాఖ ఎయిర్పోర్ట్ అథారిటీకి ఉత్తర్వులు జారీ చేయనుంది.
భయపెడుతోన్న 'శంషాబాద్ ఎయిర్పోర్ట్' - 3 వారాలుగా అసలు ఏం జరుగుతోంది?
ఎన్నో అభివృద్ధి పనులు : హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోనే అతి పెద్ద నగరంగా వరంగల్ పేరొంది, అభివృద్ధిలో దూసుకెళ్తోంది. కాకతీయ మెగాజౌళి పార్కు ఏర్పాటు ఐటీ పరిశ్రమలు, యునెస్కోతో రామప్ప అంతర్జాతీయ పర్యాటక కేంద్రం కావడం ఇలా ఒక్కొక్కటిగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు వస్తూ ఓరుగల్లు అభివృద్ధి చెందుతోంది. ఇలా ఎన్నో ప్రయోజనాలున్న తరుణంలో అభివృద్ధి చేసే పనులు నగరంలో సాగుతుండడంతో ప్రజలు హర్షిస్తున్నారు.
మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150కిలో మీటర్ల దూరం ఒప్పందాన్ని జీఎమ్మాఆర్ సంస్థ విరమించుకుంది. కొత్త రన్వే విస్తరణ, టెర్మినల్ భవనాలు, ఏటీసీ, నేవిగేషనల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టలేషన్ విభాగాల నిర్మాణాలు జరగనున్నాయి.
మంత్రి, ఎంపీ హామీ : భూ సేకరణ చేసిన నక్కలపల్లి, గుంటూరుపల్లి, గాడిపల్లి గ్రామాలకు చెందిన 233 మంది రైతులకు త్వరలోనే సర్కార్ పరిహాకం ఇవ్వనుంది. ఇందులో వ్యవసాయ క్షేత్రాలు, అసైన్డ్ భూములు, లే అవుట్ ప్లాట్లు, 13 నివాస గృహాలున్నాయి. భూ నిర్వాసితులకు తగిన న్యాయం చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ సత్యశారద సమక్షంలో హామీ ఇచ్చారు. భూ బాధితులు కమిటీగా ఏర్పడి నివేదిక అందజేశారు.
మామునూరు విమానాశ్రయానికి మొత్తం 1,875 ఎకరాల స్థలం ఉండగా అందులో 6.6 కిలో మీటర్ల రన్వే, పైలట్, సిబ్బంది గృహాలు, పైలట్ శిక్షణ కేంద్రం, ఒకటి కన్నా ఎక్కువ టెర్మినళ్లు ఉండేవి. కాగా విమానాశ్రయానికి చెందిన 468 ఎకరాల భూమిలో టీజీఎస్పీ 4న బెటాలియన్, పోలీస్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 700 ఎకరాల్లో ప్రభుత్వం డెయిరీ ఫాం నిర్మించగా, మిగిలిన స్థలం చుట్టూ రక్షణగా ఇటీవల ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ప్రహరీ గోడను నిర్మించారు.
హైదరాబాద్ ఎయిర్పోర్టులో 6 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ - తెర వెనక ఆ పుస్తక రచయిత!
'3 నిమిషాలు మాత్రమే కౌగిలించుకోండి!'- హెచ్చరిక బోర్డులు పెట్టిన న్యూజిలాండ్- ఎందుకో తెలుసా?