అధికారిక లాంఛనాలతో జవాన్ మహేశ్ అంత్యక్రియలు - భారీగా తరలివచ్చిన స్థానికులు
Published : Jul 27, 2024, 4:05 PM IST
Army Jawan Mahesh Last Rites :అసోంలో ఆర్మీలో అగ్నిపథ్ జవాన్గా విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యం కారణంగా కన్నుమూసిన ఈరేటి మహేశ్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో పూర్తిచేశారు. ముందుగా హలియ నుంచి జవాను స్వగ్రామం మదారీగూడెం వరకు ప్రత్యేక వాహనంలో అంతిమయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. మహేష్ భౌతికాయానికి నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్, మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్ నివాళులర్పించారు. అనంతరం ఆర్మీ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు.