ACB Caught State tax officer Indira :ఓ వ్యాపారి వద్ద నుంచి రూ.35 వేలు లంచం తీసుకుంటూ ఓ వాణిజ్య పన్నుల శాఖ అధికారిణి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. అబిడ్స్లోని కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో స్టేట్ టాక్స్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఇందిరా రెండు రోజుల క్రితం నారాయణగూడ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారికి జీఎస్టీ పెండింగ్లో ఉందంటూ, నోటీసులు జారీ చేశారని ఏసీబీ డీఎస్పీ కె.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
రూ.35 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన స్టేట్ టాక్స్ ఆఫీసర్
Published : Aug 23, 2024, 9:02 PM IST
జీఎస్టీ చెల్లింపుతో పాటు భవిష్యత్లో అతని వ్యాపారానికి ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఉండాలంటే, రూ.50 వేలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. చివరకు రూ.35వేలకు ఒప్పందం కుదిరిందని, అయితే లంచం ఇవ్వడం ఇష్టంలేని వ్యాపారి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అబిడ్స్లోని కార్యాలయంలో రూ.35 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అధికారిణి ఇందిరాపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.