Journalist Arrested and remanded: సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్లో హైడ్రా పేరుతో ఓ నిర్మాణదారుడ్ని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన విలేకరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అమీన్ పూర్లోని సీబీఆర్ కాలనీలో రవి అనే వ్యక్తి రెండంతస్థుల భవనం నిర్మిస్తున్నారు. ఓ పత్రికలో విలేకరిగా పని చేసే రాము భవన నిర్మాణానికి అనుమతులు లేవని, ప్రభుత్వ స్థలంలో ఇళ్లు నిర్మిస్తున్నారంటూ రవిని బెదిరించాడు.
హైడ్రా పేరుతో ఓ విలేకరి డబ్బుల డిమాండ్ - పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రిమాండ్
Published : Sep 13, 2024, 3:10 PM IST
Journalist Arrested and remanded (ETV Bharat)
ఆర్డీవో, తహసీల్దార్లతోతో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్లతో నిత్యం మాట్లాడుతుంటానని చెప్పాడు. పాతబస్తీకి చెందిన పహిల్వాన్లు కూడా తెలుసని, రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో రవి అమీన్ పూర్ పోలీస్ స్టేషన్లో విలేకరి రాముపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడుని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా, బెదిరించిన మాట వాస్తవమే అని తేలడంతో రిమాండుకు తరలించారు.