3 Hyderabad Pilgrims Died in Odisha Road Accident :ఒడిశాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ యాత్రికులు ముగ్గురు మృతి చెందారు. 20 మందికి తీవ్ర గాయలయ్యాయి. పాతబస్తీ ఛత్రినాక నుంచి 23 మంది భక్తులు తీర్థయాత్రకు బయలుదేరారు. ఒడిశాలోని బరంపురం సమీపంలో వీరు ప్రయాణిస్తున్న ట్రావెల్స్ బస్సు మరో వాహనాన్ని ఢీ కొట్టింది.
Published : Jul 13, 2024, 11:40 AM IST
ఒడిశాలో రోడ్డు ప్రమాదం - ముగ్గురు హైదరాబాదీల మృతి
3 Hyderabad Pilgrims Died in Odisha Road Accident (ETV Bharat)
ఈ ప్రమాదంలో ఉదయ్ సింగ్, క్రాంతి భాయ్, ఉప్పలయ్య అనే ముగ్గురు మృతి చెందారు. తీర్థయాత్రలకు వెళ్లిన వారంతా ఉప్పుగూడ దానయ్యనగర్ వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.