25 Members in One Auto in Nellore :ఆటోలో ఆరుగురు ప్రయాణికులు ఎక్కితేనే కష్టం. అలాంటిది 25 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. అసలు ఆటోలో డ్రైవర్కు ఓ వైపు నలుగురు, మరో పక్కకు ముగ్గురు, మధ్యలో 12 మంది, వెనుక ఐదుగురు విద్యార్థినులు ఉన్నారు. డ్రైవర్తో కలిపి మొత్తం 25 మంది అందులో ఎక్కారు. గ్రామాలకు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఇలా వస్తున్నామని పొదలకూరు జడ్పీ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పాఠశాల వదిలాక సొంతూళ్లకు వెళ్తుండగా ‘ఈనాడు’ కెమెరా క్లిక్మంది.
పూర్తి వివరాల కోసం కింది లింక్ క్లిక్ చేయండి