national

నలుగురు వెళ్లాల్సిన ఆటోలో 25 మంది విద్యార్థులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : 15 hours ago

Updated : 11 hours ago

members_in_one_auto_in_nellore
members_in_one_auto_in_nellore (ETV Bharat)

25 Members in One Auto in Nellore :ఆటోలో ఆరుగురు ప్రయాణికులు ఎక్కితేనే కష్టం. అలాంటిది 25 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. అసలు ఆటోలో డ్రైవర్​కు ఓ వైపు నలుగురు, మరో పక్కకు ముగ్గురు, మధ్యలో 12 మంది, వెనుక ఐదుగురు విద్యార్థినులు ఉన్నారు. డ్రైవర్‌తో కలిపి మొత్తం 25 మంది అందులో ఎక్కారు. గ్రామాలకు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఇలా వస్తున్నామని పొదలకూరు జడ్పీ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పాఠశాల వదిలాక సొంతూళ్లకు వెళ్తుండగా ‘ఈనాడు’ కెమెరా క్లిక్‌మంది.

పూర్తి వివరాల కోసం కింది లింక్ క్లిక్ చేయండి

Last Updated : 11 hours ago

ABOUT THE AUTHOR

...view details