Vinesh Phogat Olympics:పారిస్ ఒలింపిక్స్లో భారత స్టార్ రెజ్లర్ అదిరే శుభారంభం చేసింది. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో రెజ్లింగ్ (50కేజీల) ఈవెంట్ సెమీస్కు దూసుకెళ్లింది. తొలుత ప్రీ క్వార్టర్స్లో వరల్డ్ నెం.1 సుసాకీ (జపాన్)ను ఎదుర్కొన్న వినేశ్ అద్భుతంగా పోరాడింది. తొలుత 0-2తో వెనుకబడ్డా, తర్వాత పుంజుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ సునాకీని 3-2తో ఓడించి క్వార్టర్స్కు అర్హత సాధించింది.
వినేశ్ అదుర్స్ - వరల్డ్ నెం.1 బెదుర్స్ - కెరీర్లోనే పెద్ద ఝలక్ ఇచ్చిందిగా!
Published : Aug 6, 2024, 6:31 PM IST
తొలిసారి: నాలుగుసార్లు ప్రపంచఛాంపియన్ సుసాకీకి వినేశ్ ప్రీ క్వార్టర్స్లో షాకిచ్చింది. ఈ మ్యాచ్కు ముందు 82మ్యాచ్ల్లో సుసాకీకి ఓటమి లేదు. ఇంటర్నేషనల్ కెరీర్లో 10ఏళ్లుగా పరాజయంలేని సుసాకీకి వినేశ్ తొలిసారి ఓటమి రుచి చూపించింది. అలాగే సుసాకీని ఓడించిన తొలి భారత రెజ్లర్గా నిలిచింది.
గంట వ్యవధిలోనే క్వార్టర్స్ ఆడిన వినేశ్ అందులోనూ అదరగొట్టింది. లివచ్ ఒక్సానా (ఉక్రెయిన్)పై 7-5 తేడాతో నెగ్గి ఒలింపిక్స్లో తొలిసారి సెమీస్కు దూసుకెళ్లింది. మంగళవారం రాత్రి జరిగనున్న సెమీస్లో యుస్నీలిస్ లోపెజ్ (క్యుబా)తో వినేశ్ తలపడనుంది.