Rishabh On T20 Final Match:2024 టీ20 వరల్డ్కప్ విక్టరీపై టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్ తాజాగా మాట్లాడాడు. ఆఖరి ఓవర్లో డేవిడ్ మిల్లర్ బాదిన బంతిని చూశాక మొదట్లో సిక్స్ అనుకున్నామని రిషభ్ తాజాగా ఓ పాడ్కాస్ట్లో చెప్పాడు. 'బంతి గాల్లోకి లేవగానే అంతా అయిపోయింది అనుకున్నా. బ్యాట్కు బంతి తగలగానే అది కచ్చితంగా సిక్స్ వెళ్తుందనుకున్నాను. కానీ, టీమ్ఇండియా ఫ్యాన్స్ ప్రార్థనల వల్ల అది బౌండరీ లైన్ దాటలేదు' అని పంత్ సరదాగా అన్నాడు.
అభిమానుల ప్రార్థనల వల్లే ఆ బంతి బౌండరీ దాటలేదు: పంత్
Published : Sep 9, 2024, 2:33 PM IST
Rishabh T20 Final (Source: Associated Press)
కాగా, చివరి ఓవర్లో సిక్సర్ దిశగా వెళ్తున్న ఆ బంతిని సూర్యకుమార్ అద్భుత క్యాచ్ పట్టి మ్యాచ్ను మలుపు తిప్పాడు. ఇక ఆ మ్యాచ్లో భారత్ 7 పరుగుల తేడాతో నెగ్గి వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది.