national

ETV Bharat / snippets

'పాకిస్థాన్ వెళ్లే ఛాన్సే లేదు, మా మ్యాచ్​లు అక్కడ పెట్టండి'

By ETV Bharat Telugu Team

Published : Jul 11, 2024, 10:57 AM IST

2025 ICC Champions Trophy
2025 ICC Champions Trophy (Source: Getty Images)

Champions Trophy 2025:2025 ఛాంపియన్స్​ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్​కు వెళ్లే ఛాన్స్ లేదని బీసీసీఐ వర్గాలు తాజాగా వెల్లడించాయి. టోర్నీలో మ్యాచ్​లు ఆడేందుకు భారత జట్టును భద్రతా కారణాల దృష్యా ఆతిథ్య దేశం పాకిస్థాన్​కు పంపేందుకు బీసీసీఐ సిద్ధంగా లేదట. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మ్యాచ్​ల కోసం హైబ్రిడ్ మోడల్​ను పరిశీలించాలని ఐసీసీని బీసీసీఐ కోరనుందట. ఈ మేరకు దుబాయ్, శ్రీలంక దేశాల్లో టీమ్ఇండియా మ్యాచ్​లు నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని కోరనున్నట్లు బోర్డు మెంబర్ ఒకరు చెప్పారు.

కాగా, వచ్చే వారం కొలంబోలో జరగనున్న ఐసీసీ మీటింగ్​లో బీసీసీఐ ఈ విషయాన్ని ప్రస్తావించనున్నట్లు తెలిసింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్థాన్ దక్కించుకుంది. దీంతో టోర్నమెంట్ పాకిస్థాన్​లో జరగనుంది. అయితే ఇరుదేశాల మధ్య వివాదాల కారణంగా టీమ్ఇండియా కొన్నేళ్లుగా పాక్​కు వెళ్లడం లేదు. గతేడాది ఆసియా కప్​కు కూడా పాక్ ఆతిథ్యమివ్వగా, భారత్ మ్యాచ్​లు శ్రీలంకలో నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details