Sri Lanka Cricket Head Coach: శ్రీలంక క్రికెట్ జట్టుకు దిగ్గజ ప్లేయర్ సనత్ జయసూర్య హెడ్కోచ్గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని లంక క్రికెట్ బోర్డు జయసూర్య నియామకాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. 2024 అక్టోబర్ 1నుంచే జయసూర్య నియామకం అమలులోకి వచ్చిందని పేర్కొంది. ఈ మేరకు జయసూర్యకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్లో ఓ పోస్ట్ షేర్ చేసింది.
'శ్రీలంక జట్టుకు జయసూర్య హెడ్కోచ్గా ఎంపికయ్యాడు. జయసూర్య తాత్కాలిక కోచ్ బాధ్యతల్లో శ్రీలంక ఇటీవలకాలంలో భారత్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ పర్యటనల్లో విజయాలు సాధించింది. ఈ ఫలితాలను దృష్టిలో ఉంచుకొని బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది' అని పేర్కొంది. కాగా, జయసూర్య 2026 మార్చి 31 దాకా హెడ్కోచ్ బాధ్యతల్లో ఉండనున్నాడు.