ETV Bharat / state

మరికాసేపట్లో తిరుమల శ్రీవారి గరుడ వాహన సేవ

తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామివారి గరుడ వాహన సేవ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. గరుడ సేవను వీక్షించేందుకు మాడ వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. గోవింద నామస్మరణతో ఆధ్యాత్మిక శోభను తిరుమలగిరులు సంతరించుకున్నాయి.

author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Updated : 2 hours ago

Garuda Vahanam Seva in Tirumala
Garuda Vahanam Seva in Tirumala (ETV Bharat)

Garuda Vahanam Seva in Tirumala : భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి గరుడ వాహన సేవ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. గరుడ వాహన సేవను వీక్షించేందుకు భక్త జనం భారీగా తిరుమలకు తరలివచ్చారు. మాడ వీధుల్లోని 231 గ్యాలరీలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో శిలా తోరణం కూడలి నుంచి క్యూలైన్​లోకి ప్రవేశించాలని టీటీడీ అధికారులు కోరుతున్నారు. భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, మజ్జిగ, పాలును టీటీడీ పంపిణీ చేస్తోంది. గోవింద నామస్మరణతో తిరుమల మారుమోగుతోంది.

400లకు పైగా ఆర్టీసీ బస్సులు : తిరుమలలో గరుడోత్సవంలో భాగంగా నేటి సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీ మలయప్పస్వామి మాడవీధుల్లో విహరించనున్నారు. గరుడ వాహన సేవను సుమారు 3.5 లక్షల మంది భక్తులు తిలకించనున్నారు. మాడవీధుల్లోని 231 గ్యాలరీల్లో సుమారు రెండు లక్షల మంది వీక్షించేలా ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు. మరోవైపు, గరుడ వాహన సేవకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసి, 400లకు పైగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసింది. ఈ బస్సులు 3 వేల ట్రిప్పులు నడిచేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

గరుడ సేవకు విస్తృత ఏర్పాట్లు : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన గరుడ వాహన సేవకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు మెరుగైన సేవలు అందించేలా సూక్ష్మ స్థాయిలో ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. వకుళామాత, వెంగమాంబ కేంద్రాల నుంచి అన్న ప్రసాదాల పంపిణీ నిరంతరం జరిగేలా చర్యలు చేపట్టామన్నారు. మాడ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులతో పాటు తిరుమలకు చేరుకొంటున్న భక్తులు గరుడ వాహన సేవ వీక్షించేందుకు తగిన సౌకర్యాలు కల్పించామని వివరించారు.

Garuda Vahanam Seva in Tirumala : భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి గరుడ వాహన సేవ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. గరుడ వాహన సేవను వీక్షించేందుకు భక్త జనం భారీగా తిరుమలకు తరలివచ్చారు. మాడ వీధుల్లోని 231 గ్యాలరీలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో శిలా తోరణం కూడలి నుంచి క్యూలైన్​లోకి ప్రవేశించాలని టీటీడీ అధికారులు కోరుతున్నారు. భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, మజ్జిగ, పాలును టీటీడీ పంపిణీ చేస్తోంది. గోవింద నామస్మరణతో తిరుమల మారుమోగుతోంది.

400లకు పైగా ఆర్టీసీ బస్సులు : తిరుమలలో గరుడోత్సవంలో భాగంగా నేటి సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీ మలయప్పస్వామి మాడవీధుల్లో విహరించనున్నారు. గరుడ వాహన సేవను సుమారు 3.5 లక్షల మంది భక్తులు తిలకించనున్నారు. మాడవీధుల్లోని 231 గ్యాలరీల్లో సుమారు రెండు లక్షల మంది వీక్షించేలా ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు. మరోవైపు, గరుడ వాహన సేవకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసి, 400లకు పైగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసింది. ఈ బస్సులు 3 వేల ట్రిప్పులు నడిచేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

గరుడ సేవకు విస్తృత ఏర్పాట్లు : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన గరుడ వాహన సేవకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు మెరుగైన సేవలు అందించేలా సూక్ష్మ స్థాయిలో ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. వకుళామాత, వెంగమాంబ కేంద్రాల నుంచి అన్న ప్రసాదాల పంపిణీ నిరంతరం జరిగేలా చర్యలు చేపట్టామన్నారు. మాడ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులతో పాటు తిరుమలకు చేరుకొంటున్న భక్తులు గరుడ వాహన సేవ వీక్షించేందుకు తగిన సౌకర్యాలు కల్పించామని వివరించారు.

IRCTC తిరుమల స్పెషల్ టూర్ ప్యాకేజీ - తక్కువ ధరలోనే 3 రోజుల ట్రిప్ - స్పెషల్ దర్శనం కూడా! - IRCTC Tirumala Tour Package

తిరుమల బాలాజీకి తలనీలాలే ఎందుకు ఇస్తారు? దీని వెనుక కథేంటో తెలుసా? - why do we offer hair at tirupati

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.