Team India Players Felicitation:టీ20 వరల్డ్కప్ నెగ్గి స్వదేశానికి వచ్చిన టీమ్ఇండియా ప్లేయర్లను బీసీసీఐ సన్మానించనుంది. ముంబయి వాంఖడే స్టేడియంలో గురువారం రాత్రి 7 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అయితే ఈ ఈవెంట్ ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్న ఫ్యాన్స్కు ముంబయి క్రికెట్ అసోసియేషన్ గుడ్న్యూస్ చెప్పింది. ఈ ఈవెంట్కు ప్రేక్షకులకు ఫ్రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
క్రికెట్ ఫ్యాన్స్ ఇది విన్నారా? వాంఖడేకు ఫ్రీ ఎంట్రీ
Published : Jul 4, 2024, 1:26 PM IST
Team India (Associated Press)
'సన్మాన కార్యక్రమానికి మేం ఆడియెన్స్కు ఫ్రీ ఎంట్రీ కల్పిస్తున్నాం. స్టేడియంలోకి వచ్చేందుకు ఎలాంటి టికెట్ కొనుగోలు చేయనక్కర్లేదు. అయితే ముందుగా స్టేడియం వద్దకు చేరుకున్న వారికే ప్రాధాన్యత ఉంటుంది. టీమ్ఇండియాకు స్వాగతం పలికేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. ఈవెంట్లో ఎలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిడ్డమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం' అని ఎమ్సీఏ అధికారి చెప్పారు.