పుతిన్కు మోదీ ఫోన్ కాల్- ఉక్రెయిన్ పర్యటనపైనే చర్చంతా!
Published : Aug 27, 2024, 4:16 PM IST
PM Modi Speaks To Putin :ఉక్రెయిన్ పర్యటన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ పర్యటనపై పుతిన్తో మోదీ చర్చించారు. ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య స్థిరమైన, శాంతియుత చర్చలకు భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. భారత్, రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు నేతలు చర్చించినట్లు ప్రధాని ఎక్స్లో పోస్ట్ చేశారు. గత నెల రష్యా పర్యటన చేపట్టిన ప్రధాని మోదీ, తాజాగా ఆగస్టు 23న ఉక్రెయిన్లో పర్యటించారు. అయితే ఉక్రెయిన్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ పుతిన్తో మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.