హెచ్సీఎల్ టెక్ ఛైర్పర్సర్ రోష్ని నాడార్కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం
Published : Jul 8, 2024, 10:43 PM IST
Roshni Nadar Malhotra France Highest Civilian Award : ప్రముఖ పారిశ్రామికవేత్త, హెచ్సీఎల్ టెక్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రాను ఫ్రాన్స్ ప్రభుత్వ అత్యున్నత పౌరపురస్కారం చెవలియర్ నైట్ ఆఫ్ ది లిజియన్ వరించింది. రోష్ని వ్యాపార ప్రపంచానికి అందించిన సేవలకు గానూ ఫ్రాన్స్ నైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్తో సత్కరించిదని హెచ్సీఎల్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై స్పందించిన రోష్ని నాడార్, ఈ గౌరవాన్ని అందుకోవడం తన అదృష్టం అని, ఇది భారత్, ఫ్రాన్స్ల మధ్య వ్యూహాత్మక సంబంధాన్ని నొక్కి చెబుతుంది అని పేర్కొన్నారు. వ్యూహాత్మక మార్కెట్ అయిన ఫ్రాన్స్లో సుదీర్ఘకాలం ఉన్న హెచ్సీఎల్ టెక్ కార్యకలాపాలను విస్తరించడానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. తమ విభిన్న సేవల పోర్ట్ఫోలియో ద్వారా ఫ్రాన్స్లో ఫ్రెంచ్ వ్యాపారాల ట్రాన్స్ఫర్మేషన్కు కూడా కట్టు ఉన్నట్లు చెప్పారు.