national

ETV Bharat / snippets

హెచ్​సీఎల్ టెక్​ ఛైర్​పర్సర్ రోష్ని నాడార్‌​కు ఫ్రాన్స్​ అత్యున్నత పౌర పురస్కారం

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 10:43 PM IST

Roshni Nadar Malhotra France Highest Civilian Award
Roshni Nadar Malhotra France Highest Civilian Award (GettyImages)

Roshni Nadar Malhotra France Highest Civilian Award : ప్రముఖ పారిశ్రామికవేత్త, హెచ్‌సీఎల్ టెక్ చైర్‌పర్సన్‌ రోష్ని నాడార్‌ మల్హోత్రాను ఫ్రాన్స్‌ ప్రభుత్వ అత్యున్నత పౌరపురస్కారం చెవలియర్‌ నైట్‌ ఆఫ్‌ ది లిజియన్‌ వరించింది. రోష్ని వ్యాపార ప్రపంచానికి అందించిన సేవలకు గానూ ఫ్రాన్స్​ నైట్​ ఆఫ్​ ది లీజియన్ ఆఫ్​ ఆనర్​తో సత్కరించిదని హెచ్​సీఎల్​ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై స్పందించిన రోష్ని నాడార్​, ఈ గౌరవాన్ని అందుకోవడం తన అదృష్టం అని, ఇది భారత్​, ఫ్రాన్స్‌ల మధ్య వ్యూహాత్మక సంబంధాన్ని నొక్కి చెబుతుంది అని పేర్కొన్నారు. వ్యూహాత్మక మార్కెట్ అయిన ఫ్రాన్స్‌లో సుదీర్ఘకాలం ఉన్న హెచ్‌సీఎల్‌ టెక్ కార్యకలాపాలను విస్తరించడానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. తమ విభిన్న సేవల పోర్ట్​ఫోలియో ద్వారా ఫ్రాన్స్​లో ఫ్రెంచ్​ వ్యాపారాల ట్రాన్స్​ఫర్మేషన్​కు కూడా కట్టు ఉన్నట్లు చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details