మెదడుకు శస్త్రచికిత్స చేయించుకుంటూనే 'వేణుగానం' చేసిన పేషెంట్
Published : 6 hours ago
Brain Surgery While Playing Flute :బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న ఓ వ్యక్తి శస్త్ర చికిత్స చేయించుకుంటూనే వేణుగానం వినిపిస్తూ వైద్యులను రంజింపజేశారు. కర్ణాటక రాష్ట్రం బెళగావిలోని కొల్లాపుర కన్హేరి మఠానికి చెందిన సిద్ధగిరి హాస్పిటల్లో గురువారం ఈ ఆపరేషన్ జరిగింది. శస్త్రచికిత్స జరిగిన 5 గంటల పాటు సదరు వ్యక్తి వేణుగానం చేస్తూనే ఉన్నారు. నరాల వ్యాధుల నిపుణుడు శివశంకర్, మత్తుమందు విభాగ వైద్యుడు ప్రకాశ భరమగౌడ నేతృత్వంలో వైద్యులు ఆ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. పేషెంట్ మెలకువగా ఉన్నప్పుడు నిర్వహించే ఈ శస్త్రచికిత్సను అవేక్ క్రేనియాటమీగా వ్యవహరిస్తారని శివశంకర్ తెలిపారు. శస్త్రచికిత్సలో పాల్గొన్న వైద్యులను మఠాధిపతి అదశ్య కాడసిద్ధేశ్వర స్వామి అభినందించారు.