తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Aug 5, 2024, 5:09 PM IST

ETV Bharat / videos

మంథనిలో నకిలీ ఫోన్​పేతో మోసం - జిరాక్స్​ సెంటర్​లో పట్టుబడిన యువకుడు - Fake Phonepe Fraud in Peddapalli

Young Man Cheating with Fake Phonepe : భయ్యా ఫోన్​​పే చేస్తా క్యాష్​ ఇస్తారా అంటూ ఓ యువకుడు నకిలీ ఫోన్​పేతో జిరాక్స్​ సెంటర్​ యజమానిని బురిడీ కొట్టించి మోసం చేశాడు. మళ్లీ అదే పనిగా మరోసారి వెళ్లగా యజమానికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ యువకుడి ఫోన్​పే స్కాం బయటపడింది. పెద్దపెల్లి జిల్లా మంథని బస్టాండ్ సమీపంలోని ఓ ఆన్లైన్​ & జిరాక్స్ సెంటర్​కు రాజ్ కుమార్ అనే యువకుడు వచ్చి ఫోన్​పే చేసి డబ్బులు తీసుకుంటుండగా షాప్​ నిర్వాహకుడికి అనుమానం వచ్చింది.

దీంతో ఆ యువకుడు చేసిన ఫోన్​పే డబ్బులు రాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆదివారం కూడా ఆ యువకుడు ఇలాగే షాప్​​కు వచ్చి డబ్బులు ఫోన్​పే చేసి నగదు తీసుకెళ్లాడని జిరాక్స్​ సెంటర్​ నిర్వాహకుడు తెలిపారు. నకిలీ ఫోన్​పేతో మోసం చేస్తున్న వ్యక్తి కాల్వ శ్రీరాంపూర్ మండలం ఉషన్నపల్లికి చెందిన బండారి రాజ్ కుమార్​గా గుర్తించారు.  

ABOUT THE AUTHOR

...view details