తెలంగాణ

telangana

యాదాద్రిలో వైభవంగా మొదలైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు - Yadadri Jayanthi Utsavalu 2024

By ETV Bharat Telangana Team

Published : May 20, 2024, 7:59 PM IST

Yadadri Lakshmi Narasimha Swamy Jayanthi Utsavalu (ETV Bharat)

Yadadri Lakshmi Narasimha Swamy Jayanthi Utsavalu : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం రోజున ఉదయం స్వస్తివాచనం, విశ్వక్సేన పూజలతో ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టారు. అలాగే లక్ష కుంకుమార్చన తిరు వెంకటపతి అలంకార సేవలో మాడవీధుల్లో స్వామి వారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం సాయంత్రం వేళ అంకురార్పణ హవనం, గరుడ వాహనం, తదుపరి పర వాసుదేవా అలంకార సేవలో మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శమిచ్చారు.

Yadadri Jayanthi Utsavalu : యాదాద్రి అనుబంధ పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కూడా యథావిధిగా జయంతి ఉత్సవాలు కొనసాగాయి. ఈ నెల 21న ఉదయం నిత్యమూలమంత్ర హవనం, లక్షపుష్పార్చన, కాళీయమర్ధన అలంకార సేవోత్సవం ఉంటుంది. సాయంత్రం నరసింహ మూల మంత్ర హవనం, నిత్య పూర్ణాహుతి అనంతరం ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయి. ఈ నెల 22వ తేదీన మహా పూర్ణాహుతి, సహస్ర కలశాభిషేకం, నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావం, మహా నివేదన, తీర్థప్రసాద గోష్టి ఆశీర్వచనం అనంతరం జయంత్యుత్సవాలు ముగుస్తాయి. 

ABOUT THE AUTHOR

...view details