తెలంగాణ

telangana

LIVE : లోక్​సభలో బడ్జెట్​పై వాడివేడి చర్చ - LOK SABHA LIVE TODAY

By ETV Bharat Telangana Team

Published : Jul 24, 2024, 11:02 AM IST

Updated : Jul 24, 2024, 8:04 PM IST

Lok Sabha Live (ETV Bharat)
Lok Sabha Live : వికసిత్‌భారత్ లక్ష్య సాధన దిశగా మోదీ 3.O సర్కార్‌వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మూడోవిడత ప్రభుత్వ తొలి బడ్జెట్‌లో నవ సూత్రావళిని ఆవిష్కరించింది. అన్ని రంగాల్లోనూ ఉద్యోగ, ఉపాధి కల్పనే వీటి లక్ష్యమని ఉద్ఘాటించింది. తొమ్మిది ప్రాధాన్యాంశాలను సమర్థంగా అమలు చేయడం ద్వారా అన్నివర్గాల ప్రజలకు విస్త్రత అవకాశాలు కల్పిస్తామని ప్రకటించింది. ఈ మేరకు 48.21లక్షల కోట్ల రూపాయల అంచనాలతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి వార్షిక పద్దును పార్లమెంటుకు సమర్పించింది. వ్యవసాయానికి మరోసారి అగ్రతాంబూలం ఇచ్చిన మోదీ సర్కార్ దేశ సమగ్రాభివృద్ధికి జాతీయ సహకార విధానం తీసుకొస్తామని వెల్లడించింది. వ్యక్తిగత ఆదాయపన్నుకు సంబంధించి పాత విధానాన్ని యథావిథిగా కొనసాగించిన ఆర్థికమంత్రి కొత్త విధానంలో స్వల్పమార్పులు చేశారు. 48లక్షల 21వేల కోట్లు అంచనాలతో వార్షిక పద్దును ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇందులో రెవెన్యూ రాబడులు 31.3లక్షల కోట్లుగా పేర్కొన్నారు. మూలధన రాబడులను 16.9లక్షల కోట్లుగా వివరించారు. రెవెన్యూ వ్యయాన్ని 37.1 లక్షల కోట్లుగా వివరించిన మంత్రి మూలధన వ్యయం 11.11లక్షల కోట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్​పై ఇవాళ లోక్​సభలో వాడివేడి చర్చ జరుగుతోంది.
Last Updated : Jul 24, 2024, 8:04 PM IST

ABOUT THE AUTHOR

...view details