By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 3, 2024, 2:54 PM IST
శివాలయంలో పాములు - యథావిధిగా పూజలు చేస్తున్న పూజారి - SNAKES VISIT SHIVA TEMPLE
Snake Visit Shiva Temple in Alluri Sitaramaraj District : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఓ శివాలయంలో నాలుగు రోజులుగా రెండు పాములు ఉన్నాయి. పాడేరు మండలం వర్తనపల్లి శివాలయంలో వారం రోజుల క్రితం ఒక పాము శివాలయంలోకి ప్రవేశించి గుడి మొత్తం కలియతిరుగుతుందని ఆలయ పూజారి తిరుపతిరావు పేర్కొన్నారు. మరొక పాము నాలుగు రోజుల క్రితం ఆలయంలోకి వచ్చి గుడి గంటలపై చుట్టుకుని ఉండిపోయిందని పేర్కొన్నారు.
Varthanapally Village paderu : శివాలయంలో నాలుగు రోజులుగా రెండు పాములు ఉన్నప్పటికీ తాను యథావిధిగా పూజలు చేసుకుంటున్నానని తిరుపతిరావు తెలియజేశారు. గుడి గంటలు కొట్టినప్పుడు పాము కదులుతుంది కానీ ఎవరిని ఏమీ చేయదని పేర్కొన్నారు. గ్రామంలో కొంత మంది భక్తులు వీటిని చూసి కొంత భయపడుతున్నారని తెలిపారు. తాను మాత్రం ఎలాంటి భయం లేకుండా ఉదయం, సాయంత్రం పూజలు చేస్తున్నానని తెలియజేశారు. ఆలయంలో ఉన్న రెండు పాములు చూడడానికి చుట్టూ ప్రాంతాల వారు వచ్చి వెళ్తుంటారని పేర్కొన్నారు.