ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ముమ్మరంగా వరద సహాయక చర్యలు- బాధితులకు అండగా ప్రభుత్వం - Relief Operations in Vijayawada

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 8, 2024, 12:41 PM IST

Relief Operations in Vijayawada (ETV Bharat)

Relief Operations in Vijayawada Victims : విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేసింది. ఆహార పదార్థాలు, తాగునీరు, పాలు, బిస్కెట్లను అందజేస్తుంది. ప్రస్తుతం పారిశుధ్య పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. డ్రోన్ల ద్వారా  బ్లీచింగ్ వంటి క్రిమిసంహారక మందులను పిచికారీ చేస్తున్నారు. వందల మంది కార్మికులు చేసే పనిని వీటి ద్వారా తక్కువ సమయంలో చేయగలుగుతున్నారు. అదేవిధంగా నీరు తగ్గిన ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ వేగవంతం చేశారు.

మరోవైపు ముంపు ప్రాంతాల్లోని ప్రజలు అనారోగ్యంబారిన పడకుండా 108, 104 సంచార వాహనాల ద్వారా ప్రజలకు చికిత్స అందిస్తున్నారు. వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో వైద్యులు ఇంటింటి సర్వే చేపట్టి ప్రజలకు సేవలందిస్తున్నారు. సంచార వాహనాల దగ్గర ప్రాథమిక చికిత్స అందించి అత్యవసరమైతే 108 వాహనాల ద్వారా ప్రభుత్వాసుపత్రికి తరలించే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ముంపుకు గురైన ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెబుతున్న విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details