ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అంగరంగ వైభవంగా లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు - పెన్నానదిలో భక్తుల కోలాహలం - Pennahobilam Narasimha Swamy

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 30, 2024, 10:44 AM IST

అంగరంగ వైభవంగా లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు - పెన్నానదిలో భక్తుల కోలాహలం (ETV Bharat)

Pennahobilam Lakshmi Narasimha Swamy Brahmotsavam in Anantapur District : అనంతపురం జిల్లా పెన్న అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. స్వామి వారి బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయానికి సమీపంలో ఉన్న పెన్నానది భక్తులతో కోలాహలంగా మారింది. నదిలో స్నానాలు చేస్తూ పిల్లలు, పెద్దలతో సందడిగా గడిపారు. ఉత్సవాల్లో భాగంగా పెన్నానది ఒడ్డున మాంసాహారాన్ని వండుకుని తిన్నారు. భారీగా భక్తులు రావడంతో నది ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది.

స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి ( మే 29న) స్వామి వారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. శ్రీవారితో పాటు అమ్మవారి విగ్రహాలను అందంగా  అలంకరించి, ఉత్సవంపై ఉంచి మాడ వీధుల్లో ఊరేగించారు. అంతకు ముందు స్వామి మూల విరాట్టుకు ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు చేశారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. కార్యక్రమంలో దాతలు అంగదాల కుటుంబ సభ్యులు, ఈవో విజయ్​ కుమార్, అర్చకులు ద్వారకనాథశాస్త్రి, మయూరం బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details