తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Feb 12, 2024, 2:08 PM IST

ETV Bharat / videos

సిరిసిల్లలోని శ్రీ మార్కండేయ స్వామి ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు

MP Bandi Sanjay Participate in Markandeya Jayanti in Rajanna Sircilla District : రాజన్న సిరిసిల్ల పట్టణంలోని శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి ఆలయాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ దర్శించుకున్నారు. బండి సంజయ్​కు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు, పద్మశాలి సంఘం నాయకులు స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Markandeya Jayanti Celebrations in Rajanna Sircilla : ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల పద్మశాలి నాయకుల ఆధ్వర్యంలో శ్రీ మార్కండేయ స్వామి ఉత్సవాలు, శోభాయాత్ర ఘనంగా నిర్వహిస్తామన్నారు. దేవాలయ నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ దేవాలయానికి అయోధ్య రామ మందిరానికి సహాయ సహకారాలు అందించారని తెలిపారు. గుడి నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని బండి సంజయ్​ హామీ ఇచ్చారు. ఆలయం పూర్తైతే చుట్టు పక్కల ప్రాంతాల్లో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా వెలసిల్లనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details