తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Jul 14, 2024, 8:50 PM IST

ETV Bharat / videos

గోల్కొండ కోటలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ - లాఠీలకు పనిచెప్పిన పోలీసులు - Golconda Fort Violent Clash

Clash Between Two Groups in Golconda Fort : గోల్కొండ కోటలో రెండు గ్రూపుల మధ్య తలెత్తిన వివాదం, ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఒకరిపై మరొకరు విచక్షణారహితంగా దాడులు చేసుకుంటూ పిడిగుద్దులు కురిపించుకున్నారు. సమూహాలుగా ఏర్పాడి తమ  ప్రతాపాన్ని చూపిస్తుండగా అక్కడే విధులు నిర్వహిస్తున్న టాస్క్​ఫోర్స్ పోలీసులు లాఠీలకు పని చెప్పారు. దీంతో రెండు గ్రూపుల వారు అక్కడి నుంచి పరారయ్యారు.

Police Baton Charge to Disperse Groups : కాగా బోనాలు సందర్భంగా కోలాహలంగా ఉన్న గోల్కొండ పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా రణరంగంగా మారడంతో, గొడవ చూసిన భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో గందరగోళం ఏర్పడింది. బోనాలు పండుగ వేళ ఇటువంటి ఘర్షణలు తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగం చొరవ చూపాలని, పోలీస్ బందోబస్తు పెంచి మరింత కట్టుదిట్టం చేయాలని భక్తులు కోరుతున్నారు. మరోవైపు ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో క్లిప్‌ సామాజిక మాధ్యమంలో వైరల్‌ అయ్యింది.

ABOUT THE AUTHOR

...view details